Friday, 31 July 2026 02:33:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారం షైనింగ్ స్టార్స్ అవార్డు కు ఎంపికైన పాములపాడు ‘శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థి సయ్యద్.అయాజ్ అలీ..! 20న నంద్యాల కలెక

పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులతో ఘన విజయం :- ఆర్ఎస్ఆర్.గోపాల్ (కరస్పాండెంట్)

Date : 17 July 2026 09:46 PM Views : 93

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఇటీవల విడుదలైన 2025-26 పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన స్థానిక ‘శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాల’ విద్యార్థి సయ్యద్.అయాజ్ అలీ రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమంగా 582 మార్కులు సాధించి, డిస్టింక్షన్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన అయాజ్ అలీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. ఘనంగా ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానం కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలోని, ప్రతిభను ప్రోత్సహించడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం నంద్యాల జిల్లా కేంద్రంలోని, కలెక్టరేట్ కార్యాలయంలో వైభవంగా జరగనుంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో, జిల్లా మంత్రుల చేతుల మీదుగా విద్యార్థి సయ్యద్.అయాజ్ అలీ ఈ ప్రతిభా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. *పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయుల హర్షం* శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ ఎస్ ఆర్. గోపాల్ మాట్లాడుతూ సయ్యద్. మహమ్మద్ అయాజ్ అలీ మొదటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి ఈ ఘనత సాధించాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. విద్యార్థి సాధించిన ఈ విజయం పాఠశాలకే కాక, యావత్ నంద్యాల జిల్లాకే గర్వకారణమని వారు పేర్కొన్నారు.

*తల్లిదండ్రుల ఆనందం* తమ కుమారుడు పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడమే కాకుండా, ప్రభుత్వ అధికారిక పురస్కారానికి ఎంపిక కావడం పట్ల సయ్యద్.అయాజ్ అలీ, తల్లిదండ్రులు సయ్యద్.ముర్తుజాఅలీ ఆనంద బాష్పాలతో తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడి విజయానికి సహకరించిన పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ ఎస్ ఆర్.గోపాల్, హెడ్మాస్టర్ రాయపాటి దేవిక, యాజమాన్యానికి, ప్రతిక్షణం మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రతిభా పురస్కారం భవిష్యత్తులో సయ్యద్.అయాజ్ అలీకి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బలమైన పునాది కాగలదని స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తోటి విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారనీ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :