Friday, 31 July 2026 04:35:05 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని

Date : 26 November 2025 11:46 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో, 76వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, ప్రజాసంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భముగా ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ 1949 నవంబర్-26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందన్నారు. దేశం అత్యున్నత చట్టమైన ఈ రాజ్యాంగం తయారుచేయడానికి మొత్తం 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు పట్టింది.డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని తుది రూపానికి తెచ్చారన్నారు.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత 2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్-26ను అధికారికంగా ‘రాజ్యాంగ దినోత్సవం’గా ప్రకటించిందన్నారు. ప్రధానంగా రాజ్యాంగ నిర్మాతల కృషిని స్మరించుకోవడమే దీని ఉద్దేశం. దేశ ప్రజల హక్కులను రక్షించుకోవడం, ప్రజాస్వామ్యం, సమానత్వం, లౌకికత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను మెరుగుపరచడమే లక్ష్యం అని అన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, కర్తవ్యాలు, విధాన మార్గదర్శకాలను ప్రజలకు గుర్తు చేసే దినోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :