ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా ఈ రోజు పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామంలో, లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ లు డాక్టర్ మల్దన్న మరియు వెలుగోడు డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వారితో పాటు పాములపాడు పశువైద్యాధికారి డాక్టర్ భాస్కర్, మిట్టకందాల డాక్టర్ సాయిలీలా, దుద్యాల డాక్టర్ అశోక్, పంచాయితీ కార్యదర్శి - అబ్దుల్ సలాం, టిడిపి నాయకులు - ఎన్.మద్దిలేటి, ఎంపీటీసీలు అర్జున్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, పశువైద్య సిబ్బంది : డి.కరిముల్లా, ఎస్.తిరుమలేష్ , కె.స్వాతి, ఆర్.చాందిని బాయి, పూజిత, శ్వేత, గోపాల మిత్రలు ఎస్.మున్వర్ బాష, బి.వెంకటేశ్వర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 1వ బహుమతి డి.ఆంజనేయులు, 2వ బహుమతి విక్రమ్ కి, 3వ బహుమతి, పి.పురుషోత్తం రెడ్డి ల దూడలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. 57 మంది రైతులకు ప్రోత్సాహక బహుమతులు, నట్టల నివారణ మందులు, మినరల్ బ్రిక్స్ అందించడం జరిగింది. 60 దూడలు, 4 సెక్స్ స్టార్టెడ్ సెమెన్ పెయ్యదూడలు రైతు సోదరులు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామంలో నిర్వహించడం పట్ల పాడి రైతులు, గ్రామ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News