ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి కేవలం చలానాలు రాసే అధికారిగానే కాకుండా, బాధ్యతగల పౌరుడిగా రహదారి ప్రమాదాల నివారణకు నడుం బిగించారు. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎం వి ఐ) ఏ.సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కరివేన గ్రామ డిపౌల్ పాఠశాలలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఆయన ప్రసంగం విద్యార్థులను ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇనిస్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే, ఆ కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంటుందని ఆకాంక్షించారు. "మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, మీ ఇంటికి రక్షణ కవచాలు. మీ నాన్న హెల్మెట్ పెట్టుకోకపోతే గుర్తు చేయండి.. మీ అన్న అతివేగంగా వెళ్తే అడ్డుకోండి" అంటూ ఆయన ఇచ్చిన పిలుపు విద్యార్థులను ఆకట్టుకుంది. ఆర్టీవో-సత్యనారాయణ రెడ్డి హైలైట్ చేసిన కీలక అంశాలు *గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత* ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ హవర్) ఎంత విలువైనదో, ఆ సమయంలో క్షతగాత్రులను కాపాడటం ద్వారా ప్రాణదాతలు ఎలా కావచ్చో కళ్లకు కట్టినట్లు వివరించారు. *క్రమశిక్షణే మీకు రాజమార్గం* చదువులో ఎంత క్రమశిక్షణ అవసరమో, రోడ్డుపై వెళ్లేటప్పుడు అంతకంటే ఎక్కువ క్రమశిక్షణ అవసరమని, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణాలను రక్షించడానికేనని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికత - అప్రమత్తత: వాహనాలు నడిపేటప్పుడు ఇయర్ఫోన్స్ వాడటం వల్ల వెనుక వచ్చే వాహనాల శబ్దం వినపడదని, అది మృత్యువుకు దారి తీస్తుందని హెచ్చరించారు. చైతన్య సారథిగా ఎం.వి.ఐ. కార్యక్రమం పొడవునా విద్యార్థులతో మమేకమై, వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఆర్టీవో సత్యనారాయణ రెడ్డి చూపిన చొరవను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా కొనియాడింది. సామాజిక బాధ్యతతో ఆయన చేస్తున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. "మీ ప్రాణం, మీ కుటుంబానికి ఆధారం కాబట్టి, ఒక్క క్షణం అసహనం జీవితకాల విషాదాన్ని మిగుల్చుతుందని, నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఏ.సత్యనారాయణ రెడ్డి( మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు) కోరారు.
Admin
E Nivas News