ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన గాజులపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త బల్లా నరసింహులు కుటుంబానికి అండగా ఉంటామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వెలుగోడు మండలంలోని, వేల్పనూరు గ్రామం నందు నరసింహులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు & ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి & రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల సహకారంతో మంజూరైన రూ.5 లక్షల ప్రమాద భీమా సొమ్మును భార్య రాజమ్మకు అందజేశారు. కార్యకర్తల మరణం పార్టీకి తీరనిలోటు అని, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు.
Admin
E Nivas News