Friday, 31 July 2026 07:23:26 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వ్యవసాయానికి పగలే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఏడి కి వినతి పత్రం సమర్పించిన ఏపీ రైతు సంఘం నాయకులు

Date : 15 July 2026 08:54 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు, కొత్తపల్లె, పాములపాడు మండలాలలో వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని ఆత్మకూరు ఎలక్ట్రికల్ ఏడి ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ మే నెలలో కురిసిన వర్షాల వల్ల ముందస్తు వ్యవసాయం చేసి మొక్కజొన్న ,పత్తి, వరి, మిర్చి కూరగాయలు తదితర పంటలు వేశారనీ జూన్, జూలై నెలలో వర్షాలు ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో, తీవ్రమైన ఎండలకు పంటలు ఎండిపోతున్నాయన్నారు. గత రెండు సంవత్సరాలు పంటలు సరిగా రాక వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేయనందు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో పాత అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేసి ఎంతో ఆశతో ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురవుతుందన్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటితో పంటలు కాపాడుకుందాం అంటే కరెంటు సక్రమంగా ఉండకపోవడం వల్ల ఉన్న నీటిని పంటలకు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఎలక్ట్రికల్ అధికారులు నాణ్యమైన కరెంటును పగలే 9 గంటలు కరెంటు అందివ్వాలని, గృహ అవసరాలతో సంబంధం లేకుండా, వ్యవసాయానికి ప్రత్యేక లైన్ల ద్వారా కరెంటు అందించాలని ఎలక్ట్రికల్ ఏడి ని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆత్మకూరు ఎలక్ట్రికల్ ఏడీ మాట్లాడుతూ పగలే 9 గంటల కరెంటును సప్లై చేస్తామని లైన్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి, రైతులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యం.వీరన్న పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షుడు ఏం.మహబూబ్ బాషా, బాల యేసు, అంబయ్య, జమాల్ ఖాన్, రాజమ్మద్ రబ్బాని, బి.హిదాయతుల్లా, ఏసన్న, రంగస్వామి, దేవకుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :