Thursday, 30 July 2026 11:53:16 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆత్మకూరులో ఘనంగా రైతు సంబర సభ- అన్నదాత సుఖీభవ కార్యక్రమం

Date : 19 November 2025 11:36 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలో మార్కెట్ యార్డ్ నందు 21 వ విడత పిఎం కిసాన్ మరియు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కే.హేమలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగాల.వెంకట కృష్ణారెడ్డి హాజరు కావడం జరిగింది. వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు హేమలత మాట్లాడుతూ నియోజకవర్గంలో 25018 మంది రైతులకు 17.08 కోట్లు, ఆత్మకూరు మండలంలో 7257 మంది రైతులకు 4.93 కోట్లు రూపాయలు నగదు జమ చెక్కును పంపిణీ చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకాలను రైతులకు వివరించి, మండలంలో అన్నదాత సుఖీభవ నగదు జమ కాని రైతులు తమ గ్రామాలలోని రైతు సేవ కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. అలాగే మండల తహసిల్దార్- జి.రత్న రాధిక మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ జమకాని రైతులు అర్జీ పెట్టుకోవచని తెలిపారు. అబ్దుల్లాపురం భాష, మరియు మండల అధ్యక్షుడు రవీంద్రబాబు లు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అలాగే మాజీ మండల అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అందించడం రైతులకు ఒక వరంగా భావిస్తున్నారని తెలిపారు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి యూరియా పంపిణీ పంట నష్టపరిహారం మొదలైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని రైతులకు వివరించారు. ఉద్యానవన శాఖ అధికారి- కె.చందన ఉద్యానవన శాఖ యొక్క పథకాలను రైతులకు వివరించారు. అలాగే పట్టు పరిశ్రమ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కలామ్ పట్టు పరిశ్రమ శాఖ యొక్క పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి అరుణ, ఎంపీడీవో- సయ్యద్.ఉమర్, ఇతర మండల స్థాయి అధికారులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపమయ్య , విఆర్ఎస్ కి చైర్మన్ మల్లికార్జున్రెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, బిజెపి కార్యదర్శి షబానా, ఆత్మకూరు రైతు సేవా సహకార పరపతి సంఘం చైర్మన్-షాహబుద్దీన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కాటంరెడ్డి ,వీరభద్రుడు, పద్మావతి , రైతు సంఘం అధ్యక్షులు తపాల్ ఆశ్రఫ్ అలీ, ఇతర ప్రజా ప్రతినిధులు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఎంపీఈఓ లు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: