ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఎం.అంబేద్కర్ (ఐఏఎస్) ని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువా కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఎం.అంబేద్కర్ మాట్లాడుతూ జి.నాగముని న్యాయవాది నుండి ఇవ్వండి కర్నూలు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసి, పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినందుకు ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ గా ఎంపిక కావడం గర్వకారణం అని అన్నారు. డైరెక్టర్ నాగముని కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News