Thursday, 30 July 2026 07:48:41 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

చెలిమిల్ల గ్రామంలో మొక్కజొన్న, మినుము పంటపై గడ్డి మందు కొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకొని, నాకు నష్టపరిహారం ఇప్పించి, న్యాయం చేయాలి

లక్ష్మీనారాయణ కౌలు రైతు

Date : 18 December 2025 10:35 PM Views : 415

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, చెలిమిల్ల గ్రామంలో సర్వే నెంబర్ 41/బిలో ఉన్న 6.81 సెంట్ల మొక్కజొన్న, మినుము పంటపై దుండగులు గడ్డిమందు కొట్టి నాశనం చేశారని కౌలు రైతు జి.లక్ష్మీనారాయణ, తండ్రి ప్రసాద్ విలేకరులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు జి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను చెలిమిళ్ళ గ్రామంలోని జి.మురళి, తండ్రి ఎల్ల స్వామి కి చెందిన 41/బీలో ఉన్న 6.81 సెంట్ల పొలాన్ని రెండు లక్షల రూపాయలకు కౌలుకు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో నాలుగు ఎకరాలు మొక్కజొన్న, 2.81 సెంట్ల లో మినుము పంట వేయడం జరిగిందన్నారు. ఈ పంటలకు 2 లక్షల, 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. అయితే ఈనెల 17 బుధవారం రోజున రాత్రి సమయంలో నాకు పంటలు బాగా పండుతున్నాయని ఓర్చలేక వల్లపు రెడ్డి.విజయ భాస్కర్, తండ్రి వెంకటస్వామి నా మొక్కజొన్న, మినుము పంటపై గడ్డి మందు కొట్టారని ఆరోపించారు. గతంలో కూడా ఈ విధంగానే గడ్డి మందు కొట్టి నాశనం చేసి భయభ్రాంతులకు నన్ను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపి నాకు పంట నష్టం కలిగించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకొని, నాకు నష్టపరిహారం ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :