ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి.అంకన్న ఆధ్వర్యంలో పాములపాడులోని, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు కల్లూరి.పెద్ద మస్తానయ్య, ఎంపీడీవో కార్యాలయ ఏఓ- ఎం.సరళ, సీనియర్ అసిస్టెంట్ సి.రామసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ కలాం, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, వెలుగు ఏపీఎం- ఏ.ఉమామహేశ్వరి, సిసి-కృష్ణారెడ్డి, వీఆర్వో- మక్బూల్, ఎంసిఓ- చెంచయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలియాజ్, నటరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ టిఏ లు- ఫయాజ్, శ్రీకాంత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కుర్మయ్య, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్- కలబండి.విజయభాస్కర్, భాగ్యలక్ష్మి, విబికే- కె.భాస్కర్, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రవీణ్, తదితర ప్రభుత్వ అధికారులతో, సోషల్ మీడియా ప్రతినిధులతో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, తదితర అధికారులు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రికల చిరుకాలంలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే, కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వార్తా కథనాలతో అందరి మన్ననలు పొందడం జరిగిందని అన్నారు. వార్త పత్రికలు దేశ స్వతంత్రానికి ముందు నుండి మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కూడా ప్రతిరోజు ఉదయమే మనకి వార్తా సమాచారాన్ని మన వరకు చేరవేస్తున్నాయన్నారు. వార్త పత్రికలు ఉన్నందువలననే ప్రతి ఒక్క సమాచారాన్ని ఏర్పాటుకు అప్పుడు మనమందరము తెలుసుకోగలుగుతున్నాం అన్నారు. సామాన్య కార్యకర్త మొదలుకొని దేశ నేత వరకు ప్రతి ఒక్కరి అభివృద్ధి కొరకు వార్తా పత్రికలు కృషి చేస్తాయన్నారు. కనుక మనమందరము ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు అందించి పత్రిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
Admin
E Nivas News