ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ / ఎమ్మిగనూరు : జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని ఎమ్మిగనూరు పట్టణంలో అమీరె ముఖామి జనాబ్ చాంద్ బాష చేతుల మీదుగా పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మౌలానా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలువాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచుటకు, ప్రజలలో సామాజిక చింతన కలిగించుటకు జమాఅతె ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా నవంబర్-21 నుండి 30వ తేదీ వరకు "పొరుగువారి హక్కుల ఉద్యమం" నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగుపొరువారితో సత్సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు పరస్పర సహాయ సహకారాలు, అన్యోనతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని పోతామని, దైవ గ్రంధం ఖుర్ఆన్ తాకీదు చేసిన, ప్రవక్త ప్రవచనాల్లొ భోధించిన పోరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని, ముస్లిం సమాజాన్ని కోరుతామని తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల వారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తామని తెలిపారు. ఇరుగు- పొరుగువారు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ ఉద్యమ నిర్వహణకు జనాబ్ ఖదీర్ భాష కన్వీనర్ గా వ్యవహరిస్తారన్నారు. చాంధన్న మాట్లాడుతూ స్థానికంగా ప్రతీ ఏరియాలో ఉన్న కళాశాలల్లో, పాఠశాల ప్రాంగణాల్లో పొరుగువారి బాధ్యతలు గుర్తు చేస్తామని, శుక్రవారం ప్రసంగాల్లో, కార్నర్ మీటింగుల్లో పొరుగవారి హక్కులు, సంబంధ బాంధవ్యాల ఆవశ్యకత గురించి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖిద్ మత్ డైరెక్టర్ అల్తాఫ్, లాల్ సాబ్, అభిరామ్, అమీర్, ఖదీరన్న, మహేష్, జాకీర్, నందవరం రహీమ్, కుమార్, అలీ, హుస్సేన్, రెహమాన్, ముఖామి జమాత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News