Thursday, 30 July 2026 10:29:49 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విలువిద్యలో ఆత్మకూరు క్రీడాకారుణి ఆయేషా సిద్ధిఖి కి గోల్డ్ మెడల్ ప్రధానం

Date : 22 November 2025 10:21 PM Views : 598

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ దంపతుల కుమార్తె అయేషా సిద్ధిఖి విలువిద్య క్రీడాంశంలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అసోసియేషన్ సంబందించిన రాష్ట్ర, జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో పతకాలు సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుంది. అయేషా సిద్ధిఖి ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ ల కుమార్తె. వీరి కుటుంబం జీవనోపాధి నిమిత్తం మహబూబ్ నగర్లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయేషా సిద్ధిఖి, మహబూబ్ నగర్ పట్టణంలోని, ఎం.ఎస్.పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, వారణాసిలో ఈ నెల 19న ప్రారంభమై శుక్రవారం ముగిసిన 69వ ఎస్జీఎఫ్ అండర్-14 విభాగం నేషనల్ ఆర్చరీ పోటీల్లో అయేషా సిద్దిఖి బంగారు పతకం సాధించారు. ఈ పోటీల్లో దేశంలోని, 32 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా కంపౌండ్ రౌండ్లో టీమ్ విభాగంలో అయేషా సిద్దిఖీ ప్రత్యర్థులతో తలబడి బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన అయేషా సిద్ధిఖిని ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి-డాక్టర్ శారదాబాయి, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్ లు అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆత్మకూరుకు చెందిన అయేషా సిద్ధిఖి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆత్మకూరుకు చెందిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: