Thursday, 30 July 2026 10:18:31 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యార్థుల భద్రత డ్రైవర్ల బాధ్యత

ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇనిస్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి

Date : 23 January 2026 09:26 AM Views : 161

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఆత్మకూరు ఎంవీఐ కార్యాలయం దగ్గర, ఆయన పాఠశాల బస్సు డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆయన స్వయంగా డ్రైవర్లకు పలు వాహన చోదన మెళకువలను వివరిస్తూ, వారికి అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవర్లు పాటించాల్సిన కీలక నిబంధనలను స్పష్టం చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ప్రతి పాఠశాల బస్సుకూ తప్పనిసరిగా ఫిట్‌నెస్ ఉండాలన్నారు. కండిషన్ లేని వాహనాలు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవు అన్నారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లకు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలనీ మరియు వారు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వాహన సామర్థ్యం (సీటింగ్ కెపాసిటీ) కంటే ఒక్క విద్యార్థిని కూడా అదనంగా ఎక్కించకూడదన్నారు. విద్యాసంస్థల వాహనాలకు కచ్చితంగా 'స్పీడ్ గవర్నర్స్' అమర్చి ఉండాలనీ, వేగం పరిమితి దాటకూడదన్నారు. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు అగ్నిమాపక పరికరాలు (ఫైర్ ఎక్సటింగుషర్స్) పని చేసే స్థితిలో ఉండాలని, వారోత్సవాల సందర్భంగా ఎంవీఐ డ్రైవర్ల సందేహాలను నివృత్తి చేస్తూ, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ ధరించాలని, పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా, యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: