Friday, 17 April 2026 03:45:18 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

పి ఆర్ టి యు

Date : 25 November 2025 06:28 PM Views : 1777

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు 3వ వంతు ఉపాధ్యాయులు నైట్ డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, పలు ప్రాథమిక, ఉన్నత, గిరిజన సంక్షేమ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదులు చేయించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రధాన సమస్యలు ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ ను నియమించాలనీ, కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేయాలనీ, పదో తరగతి పరీక్షల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలనీ, మహిళ ఉపాధ్యాయులకు, పిల్లల వయస్సు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే అనే నిబంధన తొలగించి చైల్డ్ కేర్ లీవ్ జీవో విడుదల చేయాలనీ, ఉపాధ్యాయుల పెండింగ్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలనీ, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలనీ, డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలనీ, సిపిఎస్ రద్దు కోసం కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్టియు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు చంద్రశేఖర్, కలిముల్లా, హుస్సేన్ సాహెబ్, రషీద్, ఖాజా, మీర్ ఇబ్రాహీం, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :