ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోనీ, 16వ వార్డులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, నందికొట్కూరు పట్టణం నాయకులు డాక్టర్ డి.వనజ, డాక్టర్ మీనాక్షి దేవి, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుస్సేన్, లాయర్ జాకీర్ హుస్సేన్, పిఏ మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News